మట్టి గణపతులకై జై కొడుదాం

జనం కోసం మనం న్యూస్


విద్యాలయం లో మట్టి గణేష్ తో చిన్నారులు

జగిత్యాల్ జిల్లా జనం కోసం మనం న్యూస్:మల్లాపూర్ మండల్ రాఘవపేట్ లో శారదా విద్యాలయం లో మట్టి వినాయకుల ప్రతిమలను విద్యార్థులతో చేయించారు.స్థానిక పదిమంది విద్యార్థులు  ఉత్సహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మారుతి  మాట్లాడుతూ, మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. ప్టాస్టర్‌ ఆఫ్‌ పేరిస్‌తో చేసిన వినాయక విగ్రహాల వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు.కరెస్పాండెంట్ మహేష్ మాట్లాడుతూ రసాయనిక రంగుల వల్ల శ్వాసకోస, జీర్ణసంబంద వ్యాధులు ఏర్పడతాయ న్నారు. ఈ రంగాల్లో కాల్షియం, మెగ్నిషియం, సీసం, కోబాల్ట్‌ వల్ల జలచరజీవులు ప్రమాదానికి గురవుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"