కాళోజి సేవలు చిరస్మరనియం
జనం కోసం మనం న్యూస్: జగిత్యాల్ జిల్లా
*''కాళోజి సేవలు చిరస్మరనీయం"*
*తెలంగాణ జాగృతి యూత్* *జిల్లా అధ్యక్షుడు* *గనవేని మల్లేష్ యాదవ్*
ప్రజా కవి కాళోజి నారాయణ రావు చేసిన సేవలు చిరస్మరనీయoగా నిలిచి పోతాయని తెలంగాణ జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
ప్రజా కవి కాళోజి 105 వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో కాళోజి చిత్ర పటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్బంగా జాగృతి యూత్ జిల్లా ఆద్యక్షుడు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ..
తెలంగాణా ఉద్యమం కోసం ప్రజల ఆర్తి,ఆవేదన,ఆగ్రహం అయన గేయాలలో రూపు కట్టాయని అందుకే అయన తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతి ధ్వని గా కొనియడా బడతారని తెలిపారు..
పుట్టుక నీది చావు నీది అని బ్రతుకంత తెలంగాణకిచ్చిన మహానీయడాని కొనియాడారు..
ప్రజా సమస్యలే లక్ష్యంగా అయన రచనలు ఉండేవని.నిజం నిరంకుశత్వం పై కలంతో గలమెత్తిన పోరాట యోధుడని, అందుకే *ప్రజాకవి* గా బిరుదు పొందిన మహానీయుడని కొనియాడారు. కాళోజి ఆశయాలను తెలంగాణ జాగృతి కొనసాగిస్తుందని తెలిపారు...ఈ కార్యక్రమంలో..
సర్పంచ్ కుందేళ్ళ నర్సయ్య,
జాగృతి యూత్ జిల్లా నాయకులు
వేముల వాడ దేవరాజం,తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి,కళ్యాణ్,నరేష్,రాజేష్,వంశీ,రాజేందర్,మధు,అరవింద్,ప్రసాద్,రమేష్, వెంకటేష్,నరేందర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు..
Comments
Post a Comment