*బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం గా 45548 రూపాయలు అందించిన గ్రామస్తులు

 *బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం గా 45548 రూపాయలు అందించిన గ్రామస్తులు*

జనం కోసం మనం న్యూస్:


మల్లాపూర్ మండలంలోని  కుస్థాపూర్ గ్రామానికి చెందిన కటికే రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని సర్పంచ్ సరికెల లక్ష్మి-మహిపాల్ దృష్టికి తీసుకువెళ్లారు.. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న రమేష్ మరణించడంతో భార్య ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. రమేష్ మరణం తో అనాధాలయిన పిల్లల్ని చూసి ఆ గ్రామానికి చెందిన వారు ఏదైనా సహాయం చేయలని దాతలు ముందుకు వచ్చారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వారు పరాయి దేశం అయిన దుబాయ్, మస్కట్,సౌదీ దేశాలకు వెళ్లిన వారు సహాయంగా పంపిన డబ్బులు, గ్రామంలో కొందరు దాతలు ఇచ్చిన డబ్బులు మొత్తం కలిపి 45548 వేల రూపాయలను సరికెల లక్ష్మి-మహిపాల్, జిందం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందజేశారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"